ఆంధ్రప్రదేశ్‌లో విషాదాన్ని నింపిన ఆదివారం.. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత

|

Dec 20, 2020 | 7:58 PM

ఆదివారం ఏపీలో జరిగిన వేరు వేరు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలోని తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో విషాదాన్ని నింపిన ఆదివారం.. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత
Follow us on

ఆదివారం ఏపీలో జరిగిన వేరు వేరు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలోని తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు. నెల్లూరుకు చెందిన గోపీ మృతదేహం లభ్యం కాగా, కడపకు చెందిన హసన్ కోసం పోలీసులు, మత్యకారులు గాలిస్తున్నారు.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం కెడకల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటమునిగి చనిపోయిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద స్వర్ణముఖి నదిలో దిగిన అమరనాథ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అలాగే విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావివలస శివారులో రెండు బైకులను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐ.పోలవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇలా వేరువేరు ప్రమాదాల్లో ఎనిమిదిమంది మృతిచెందారు.