ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. తమ రాష్ట్ర ప్రజలను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని అమరేందర్ సింగ్ ఆరోపించారు. కరోనా పాండమిక్ సాకుతో మీరు మా రాష్ట్రంలో పాపులర్ కావడానికి యత్నిస్తున్నారని కూడా ఆయన ధ్వజమెత్తారు. కోవిడ్-19 పై ఓ ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసినందుకు ఆరెస్టు చేసిన ఆప్ కార్యకర్తకు, ఆ పార్టీ నాయకులకు మధ్య లింక్ ఉందేమో కనుగొనాలని అమరేందర్ సింగ్ తమ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. పంజాబ్ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేయాల్సిందిగా కేజ్రీవాల్ ఇటీవల తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆ కార్యకర్తల్లో ఒకడు ఈ ఫేక్ వీడియో సృష్టించి ఉండవచ్చునని తెలుస్తోంది.
పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తున్నవారిలో….. కొందరిలో కోవిడ్ లక్షణాలు ఉండవచ్చునని కూడా అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్టు కనబడుతోందని అంటున్నారు.