కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం !

| Edited By: Anil kumar poka

Oct 15, 2020 | 10:49 AM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండవచ్చునని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టుకు తెలియజేసింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక,

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం !
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండవచ్చునని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టుకు తెలియజేసింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. స్వప్న సురేష్, శివశంకర్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు టాంజానియాలో డైమండ్ బిజినెస్ ఉందని బంగారాన్ని యూఏఈ లో అమ్మానని నిందితుల్లో ఒకడైన రమీస్ చెప్పినట్టు ఎన్ఐ ఏ వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం పాత్రపై  అమెరికా విదేశాంగ శాఖ ప్రచురించిన ఫాక్స్ షీట్ ప్రకారం ఐరాస భద్రతామండలి ఆంక్షల కమిటీ ఈ విషయాన్ని పేర్కొన్నట్టు ఈ సంస్థ తెలిపింది.