ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్లో అపశృతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సభావేదిక వద్ద ఉన్న బారికేడ్లలో విద్యుత్ ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.