ఇది బీజేపీ రాజకీయ కక్ష,, సీతారాం ఏచూరి ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 11:40 AM

ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అక్రమ చర్యలు ఆ పార్టీ రాజకీయ ప్రభావితమైనవేనని, శాంతియుతంగా..

ఇది బీజేపీ రాజకీయ కక్ష,, సీతారాం ఏచూరి ఫైర్
Follow us on

ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అక్రమ చర్యలు ఆ పార్టీ రాజకీయ ప్రభావితమైనవేనని, శాంతియుతంగా నిరసనలకు దిగుతున్నవారంటే ఈ సర్కార్ భయపడుతున్నట్టు కనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా గతంలో ప్రదర్శన చేసినందుకు తనతో సహా స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, ఎకనామిస్ట్ జయతి ఘోష్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వారు తమ అనుబంధ చార్జిషీట్ లో తమను సహ కుట్రదారులుగా పేర్కొన్నారని ఆయన అన్నారు. ఢిల్లీ అల్లర్లలో 56 మందికి పైగా మరణించారని, ఇక రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేసినవారిని పోలీసులు వదిలేశారని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి కేసులకు బెదరబోమన్నారు.