రియా చక్రవర్తి బెయిల్ పై రేపు కోర్టు ఉత్తర్వులు జారీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2020 | 3:33 PM

సుశాంత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటిషన్ పై సెషన్స్ కోర్టు రేపు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే రియా గురువారం రాత్రి కూడా ముంబైలోని బైకుల్లా జైలులో..

రియా చక్రవర్తి బెయిల్ పై రేపు కోర్టు ఉత్తర్వులు జారీ
Follow us on

సుశాంత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటిషన్ పై సెషన్స్ కోర్టు రేపు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే రియా గురువారం రాత్రి కూడా ముంబైలోని బైకుల్లా జైలులో గడపవలసి ఉంటుంది. ఈమెను ఈ నెల 8 న అరెస్టు చేశారు. తాను అమాయకురాలినని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనను తప్పుడుగా ఈ కేసులో ఇరికించారని రియా తన బెయిల్ పిటిషన్ లో ఆరోపించింది. తను సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్ఛేదానినని  అరెస్ట్ రోజున బలవంతంగా తనచేత ఒప్పుకోలు ప్రకటనలు చేయించారని కూడా ఆమె వారిమీద అభియోగాలు మోపింది. కాగా-షోవిక్ చక్రవర్తిని ఎన్ సీ బీ అధికారులు ఈ నెల 4 న అరెస్టు చేశారు. తాను సుశాంత్ కి మార్జువానా ఇచ్ఛేవాడినని షోవిక్  విచారణ సందర్బంగా అంగీకరించాడు.