గార్డెన్ సిటీలో గుబులు పుట్టిస్తున్న స్ట్రెయిన్.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలు రద్దు..

|

Dec 31, 2020 | 9:39 AM

దేశంలో ఇప్పుడు స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కలవర పాటుకు గురి చేస్తోంది. బెంగళూరులో ఏడు కేసులు..

గార్డెన్ సిటీలో గుబులు పుట్టిస్తున్న స్ట్రెయిన్.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలు రద్దు..
Follow us on

Corona features : దేశంలో ఇప్పుడు స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కలవర పాటుకు గురి చేస్తోంది. బెంగళూరులో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో గార్డెన్ సిటీ వణికిపోతోంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ముగ్గురిలో కరోనా లక్షణాలు కనిపించాయి.

శివమొగ్గ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా స్ట్రెయిన్ అటాక్ అయ్యింది. సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేశారు. బెంగళూరులో రాత్రి వేళల్లో 144 సెక్షన్‌ విధించిన కర్నాటక సర్కార్.. అనేక ప్రాంతాలను నో మ్యాన్‌ జోన్‌గా గుర్తించినట్లు ప్రకటించింది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్ట్రెయిన్ బయటపడటం కలవరపాటుకు గురిచేస్తోంది. హైదరాబాద్, వరంగల్, అనంతపురం, కాకినాడలో స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులతో కాంటాక్ట్ అయిన వారి కోసం గాలిస్తున్నారు.