జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలడంతో ఈ నౌకలోనివారిమీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ షిప్ లో 3,711 మంది ప్రయాణికులను, సిబ్బందిని స్కాన్ చేశారని, వీరిలో 273 మందికి మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కసుకొబు కిటో తెలిపారు. 56 దేశాలకు చెందినవారు ఈ నౌకలో ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. టెస్టుల విషయంలో వీరంతా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.