నానికి చంద్రబాబు ఫోన్.. మారుతున్న సీన్ !

|

Jun 05, 2019 | 5:37 PM

విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఫేస్ బుక్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కాగా-చంద్రబాబు, లోకేష్ చుట్టూ కోటరీ ఏర్పడిందని, వారు ఆ కోటరీ సభ్యుల మాటలు నమ్ముతున్నారని ఆయన తాజాగా […]

నానికి చంద్రబాబు ఫోన్.. మారుతున్న సీన్ !
Follow us on

విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఫేస్ బుక్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కాగా-చంద్రబాబు, లోకేష్ చుట్టూ కోటరీ ఏర్పడిందని, వారు ఆ కోటరీ సభ్యుల మాటలు నమ్ముతున్నారని ఆయన తాజాగా కామెంట్స్ చేయడం విశేషం. అటు-నాని బీజేపీలో చేరవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన కేంద్ర మంత్రి గడ్కరీని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. నానిని చంద్రబాబు బుజ్జగించి ఆయన అలకను తీరుస్తారని అంటున్నారు.