మూడు రాష్ట్రాలకు మళ్ళీ కేంద్ర బృందాలు

|

Jun 25, 2020 | 3:44 PM

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న మూడు రాష్ట్రాలకు మరోసారి అధ్యయన బృందాలను పంపాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సారథ్యంలో కేంద్ర బృందం త్వరలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో పర్యటించనున్నది.

మూడు రాష్ట్రాలకు మళ్ళీ కేంద్ర బృందాలు
Follow us on

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న మూడు రాష్ట్రాలకు మరోసారి అధ్యయన బృందాలను పంపాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సారథ్యంలో కేంద్ర బృందం త్వరలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో పర్యటించనున్నది. కరోనా నియంత్రణపై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్ర బృందం కట్టడి యత్నాలపై కీలక సూచనలు చేయనున్నది. కేంద్ర సూచించిన విధానాలు రాష్ట్రాలలో ఏ మేరకు అమలవుతున్నాయనే అంశాన్ని పరిశీలించడంతోపాటు.. సరైన చర్యలపై సమన్వయం చేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తుందని లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.

మార్చి నెలలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పట్నించి రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడంలో చొరవ చూపుతున్న లవ్ అగర్వాల్.. తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరింత పక్కా చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని తలపెట్టారు. అందుకే మూడు కీలక రాష్ట్రాలకు తానే స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు సందర్శించనున్నది కేంద్ర బృందం.