ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా దేశీయ స్వావలంబనకు ఉద్దేశించిన ఆత్మ నిర్భర్ పథకం..భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1548 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఆ తరువాత మొత్తం పథకం కాలానికి రూ. 22,810 కోట్లు..అంటే 2020-2023 ఏళ్ళ మధ్య సుమారు 58.5 లక్షల మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. దేశంలో పబ్లిక్ డేటా సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. వీటికి లైసెన్స్ ఫీజు గానీ, రిజిస్ట్రేషన్ ఫీజుగానీ అవసరం లేదని తీర్మానించారు. అంటే ఏ విధమైన లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా పబ్లిక్ డేటా కార్యాలయాల ద్వారా పబ్లిక్ వై-ఫై సేవలను అందించడానికి సంబంధిత నెట్ వర్క్ ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని పబ్లిక్ వై-ఫై యాక్సెస్ నెట్ వర్క్. ఇంటర్ ఫేస్ ‘పీఎం వని’ గా వ్యవహరిస్తారు.
ఇంకా కొచ్చి-లక్షద్వీప్ మధ్య సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ వివరించారు.
ఆత్మ నిర్భర్ యోజన పథకం లోని కీలకాంశాలు