ఓపెన్ నాలలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. బాలిక మృతిపై కోటి పరిహారం డిమాండ్

|

Sep 19, 2020 | 9:38 PM

హైదరబాద్ నెరేడ్ మెట్ లో ప్రమాదవశాత్తూ నాలలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో న్యాయవాది మామిడి వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలలు మృత్యు కుహారాలుగా..

ఓపెన్ నాలలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. బాలిక మృతిపై కోటి పరిహారం డిమాండ్
Follow us on

హైదరబాద్ నెరేడ్ మెట్ లో ప్రమాదవశాత్తూ నాలలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో న్యాయవాది మామిడి వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలలు మృత్యు కుహారాలుగా మారుతూ పిల్లల ప్రాణాలు తీస్తూ… తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్ లో న్యాయవాది పేర్కొన్నారు. వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ న్యాయవాది కమిషన్ కు వివరించారు. ఓపెన్ నాలలపై కప్పులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలని న్యాయవాది డిమాండ్ చేసారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలంటూ న్యాయవాది కమిషన్ కోరారు. స్పందించిన కమిషన్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 13లోగా నివేదికను సమర్పించాలంటూ జిహెచ్ఎంసి కమిషనర్ ను హెచ్ ఆర్సీ ఆదేశింది.