బెంగాల్ లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య, ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, 12 గంటల బంద్ కు పిలుపు

| Edited By: Pardhasaradhi Peri

Nov 18, 2020 | 8:28 PM

పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో బీజేపీ కార్యకర్తనొకరిని కొట్టి చంపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దారుణానికి కారకులని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనతో..

బెంగాల్ లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య, ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, 12 గంటల బంద్ కు పిలుపు
Follow us on

పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో బీజేపీ కార్యకర్తనొకరిని కొట్టి చంపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దారుణానికి కారకులని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనతో  తమకు సంబంధం లేదని టీ ఎంసీ కొట్టి పారేసింది. కాలాచందర్ కర్మాకర్ అనే ఈ బీజేపీ కార్యకర్త హత్యకు నిరసనగా ఈ పార్టీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ జిల్లాలోని తుఫాన్ గంజ్ టౌన్ లో తన షాపు ఎదుట కొట్టుకుంటున్న గుంపును నివారించేందుకు వెళ్లిన ఇతడిని కొంతమంది కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇది స్థానిక వివాదమేనని, తమకు ఈ గొడవతో సంబంధంలేదని  టీఎంసీ నేతలు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.