బల్దియా గెలుపు… బండి ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ కార్పొరేటర్లు…

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 6వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

బల్దియా గెలుపు... బండి ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ కార్పొరేటర్లు...
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2020 | 2:53 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 6వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులతో ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాగా, బీజేపీ బల్దియా పోరులో 48 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఎన్నికల సమయంలోనూ బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకున్నారు. ఆ సందర్భంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఆయన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రాకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తన పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులందరితో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు.