టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ గురువారం ఏపీ సీఎం జగన్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తర్వాత తాజగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్లో జరిగిన దాణా కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు విజయసాయి. రూ.22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పెంచిపెట్టారన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చినబాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని విమర్శలకు దిగారు విజయసాయిరెడ్డి. ఏపీలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే అధికార, ప్రతిపక్ష నేతలు ట్విట్టర్లో ఇలా ఒకరిపై ఒకరు ట్వీట్స్ చేసుకుంటునే ఉన్నారు.
చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2019