దాణా స్కాం కంటే అతిపెద్ద కుంభకోణం.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

| Edited By:

Jul 26, 2019 | 2:00 PM

టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ గురువారం ఏపీ సీఎం జగన్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తర్వాత తాజగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్‌లో జరిగిన దాణా కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు విజయసాయి. రూ.22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పెంచిపెట్టారన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చినబాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని […]

దాణా స్కాం కంటే అతిపెద్ద కుంభకోణం..  ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
Follow us on

టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ గురువారం ఏపీ సీఎం జగన్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తర్వాత తాజగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్‌లో జరిగిన దాణా కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు విజయసాయి. రూ.22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పెంచిపెట్టారన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చినబాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని విమర్శలకు దిగారు విజయసాయిరెడ్డి. ఏపీలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే అధికార, ప్రతిపక్ష నేతలు ట్విట్టర్లో ఇలా ఒకరిపై ఒకరు ట్వీట్స్ చేసుకుంటునే ఉన్నారు.