బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున తమ పార్టీ కార్యకర్తలు సంయమనంతో, క్రమశిక్షణతో వ్యవహరించాలని, బాణా సంచా కాల్చడం వంటివి చేయరాదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు. ఫలితం ఎలా ఉన్నా ఆవేశానికి లోను కారాదన్నారు. ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి విదితమే. ఆ రోజున అంతా శాంతియుతంగా ఉండాలని తేజస్వి కోరారు. రౌడీ బిహేవియర్ తగదు.. ఆర్భాటాలు, ప్రదర్శనలు వద్దు అని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.