చైనాపై పార్లమెంటులో చర్చకు రెడీ ! రాహుల్ కు అమిత్ షా సవాల్

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 5:24 PM

చైనాఅంశం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పార్లమెంటులో చర్చకు తాము రెడీ అని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాహుల్ సంకుచిత రాజకీయాలతో మాట్లాడుతున్నారని,  వాటిని చైనా, పాకిస్తాన్ 'ఇష్టపడుతున్నాయని'..

చైనాపై పార్లమెంటులో చర్చకు రెడీ ! రాహుల్ కు అమిత్ షా సవాల్
Follow us on

చైనాఅంశం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పార్లమెంటులో చర్చకు తాము రెడీ అని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాహుల్ సంకుచిత రాజకీయాలతో మాట్లాడుతున్నారని,  వాటిని చైనా, పాకిస్తాన్ ‘ఇష్టపడుతున్నాయని’ ఆయన ఆరోపించారు. 1962 లో జరిగిన భారత-చైనా యుధ్ధం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఘటనలపై పార్లమెంటులో చర్చిద్దామని, అందుకు తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఓ సంస్థకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ‘సరెండర్ మోదీ’ అంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్లలో చేస్తున్న ఆరోపణపై ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఈ విధమైన వ్యాఖ్యలను చైనా, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసునని, కానీ ఒక పెద్ద పార్టీకి ఒకప్పుడు అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఈ విధమైన క్లిష్ట సమయాల్లో సంకుచిత రాజకీయాలకు పాల్పడడం, అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాగా.. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ కూడా రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన విషయం గమనార్హం.