షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్ల‌లు..

| Edited By:

Jun 04, 2020 | 6:20 PM

యూపీలోని మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ నుండి 40 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.

షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్ల‌లు..
Follow us on

యూపీలోని మీరట్ జిల్లా ఒక గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ నుండి 40 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ సంఘటన కంకర్‌ఖేరా పోలీసు సర్కిల్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. శ్రద్ధానంద్ అనే రైతు తన గదికి వెళ్లి నేలమీద ఒక పాము పిల్లను చూశాడు. వెంటనే దానిని బయట వదిలేశాడు. కొద్దిసేపటి తరువాత, అతను నిద్రించడానికి తన గదికి వెళ్ళినప్పుడు, తన మంచం మీద మరో మూడు పాము పిల్లలను చూశాడు. అతను అప్రమత్తమయ్యేలోగా, గదిలోని ఎయిర్ కండీషనర్ నుండి మరికొన్ని పాములు జారడం చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎయిర్ కండీషనర్ కవర్ తీసివేయగా పైపులో 40 పాములను చూసి షాక్ అయ్యారు.

ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో, స్థానిక ప్రజలు ఆ పాములను చూడటానికి శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. స్థానికుల సహాయంతో.. శ్రద్ధానంద్, అతని కుటుంబ సభ్యులు ఆ పాములన్నింటినీ ఒక సంచిలో ఉంచి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్థానిక పశువైద్యుడు వత్సల్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఏసీ వాడలేదు కాబట్టి, ఒక పాము పైపులో గుడ్లు పెట్టి ఉండవచ్చు దాంతో అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని తెలిపారు.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..