ముంబైలో ‘కరోనా’ వైరస్..?

| Edited By:

Jan 24, 2020 | 5:15 PM

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు. “కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం […]

ముంబైలో కరోనా వైరస్..?
Follow us on

చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని అనుమానితులుగా పేర్కొన్నారు. వీరిని ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ చైనాలోని వుహన్ నగరంకు చెందినవారు.

“కరోనావైరస్ సంక్రమించినట్లు అనుమానించబడిన వ్యక్తుల నిర్ధారణ, చికిత్స కోసం ఐసోలేషన్ వార్డ్ సృష్టించబడింది” అని డాక్టర్ కేస్కర్ తెలిపారు. కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక సూచనలు వచ్చాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి అని కస్తూర్బా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్యులు, చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు పంపమని కోరినట్లు పౌర విమానయాన సంస్థ అధికారి తెలిపారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా వివిధ విమానాశ్రయాలలో 12 వేల మంది ప్రయాణికులను బుధవారం వరకు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.