వచ్చే ఏడాది నుంచి ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌కు మంచి రోజులు.. ఎందుకో తెలియాలంటే..

గతంలో కొత్త మొబైల్ కొనాలంటే దగ్గరలో ఉన్న పట్టణాల్లోని షాపులకు వెళ్లి తీసుకునేవాళ్లం. కానీ రాను రాను ఇంటర్‌నెట్‌లో వచ్చిన మార్పుల వల్ల

వచ్చే ఏడాది నుంచి ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌కు మంచి రోజులు.. ఎందుకో తెలియాలంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 4:01 PM

గతంలో కొత్త మొబైల్ కొనాలంటే దగ్గరలో ఉన్న పట్టణాల్లోని షాపులకు వెళ్లి తీసుకునేవాళ్లం. కానీ రాను రాను ఇంటర్‌నెట్‌లో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం అందరు ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోను బుక్ చేసుకుంటున్నారు. ఇక కరోనా పుణ్యమా అని ఈ సంవత్సరం లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి.

ఇదిలా ఉంటే చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా వ్యాపారం జరిగే ఆఫ్‌లైన్ అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి కారణం షావోమి, రియల్‌మి వంటి ముఖ్యమైన మొబైల్ బ్రాండ్లు తమ షాపులను ఎక్కువగా విస్తరిస్తుండటమే. 2018లో ఆన్‌లైన్ మార్కెట్ వాటా 38.4 శాతం ఉండగా అది 2019లో 41 శాతానికి పెరిగింది. ఇక 2020లో 45శాతంగా ఉంటుందని భావిస్తున్నాయి. అయితే అక్టోబర్‌లో మొదటిసారి ఆఫ్‌లైన్ అమ్మకాలు 50 శాతం దాటాయని ఘనాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలు 60;40 పర్సంటేజ్‌గా ఉంటున్నాయని ఒక అంచానాకు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం లాక్‌డౌన్ వల్ల ఆఫ్‌లైన్ అమ్మకాలు తక్కువగా జరిగినా వచ్చే సంవత్సరం తర్వాత పరిస్థితులు సాధారణం అయిపోతాయి కనుక తిరిగి ఆఫ్‌లైన్ అమ్మకాలు పెరుగుతాయని మార్కెటింగ్ పరిశోధకులు తెలుపుతున్నారు. దీంతో త్వరలోనే ఆఫ్‌లైన్ వ్యాపారులు తిరిగి పునర్దశను సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.