Pankaj Udhas: మూగబోయిన స్వరం.. గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ఇకలేరు

|

Feb 26, 2024 | 5:13 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిచారు. ఈ మేరకు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ మరణవార్తను ధ్రువీకరించారు. నయాబ్ ఉధాస్ అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు.

Pankaj Udhas: మూగబోయిన స్వరం.. గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ఇకలేరు
Pankaj Udhas
Follow us on

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిచారు. ఈ మేరకు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ మరణవార్తను ధ్రువీకరించారు. నయాబ్ ఉధాస్ అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు. “చాలా బరువెక్కిన హృదయంతో, 2024 ఫిబ్రవరి 26 న పద్మశ్రీ పంకజ్ ఉధాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారని మీకు తెలియజేయడానికి మేం చింతిస్తున్నాము” అని పేర్కొంది. ఉధాస్ 1980 నుంచి 1990 కాలంలో తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గజల్ గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

భారతదేశంలోని ఉత్తమ గజల్ గాయకులలో ఒకరైన పంకజ్ ఉధాస్ 1951 మే 17 న గుజరాత్లో జన్మించారు. తన గజల్స్ తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. అతని శ్రావ్యమైన స్వరం, భావోద్వేగ ప్రదర్శనలు మనదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించేలా చేశాయి.

పంకజ్ ఉధాస్ అత్యంత ప్రసిద్ధ గజల్స్ లో ‘చిట్టి ఆయీ హై’, ‘ఔర్ ఆహిస్తా కిజియే బాతేన్’, ‘చండీ జైసా రంగ్ హై తేరా’, ‘నా కజ్రే కీ ధార్’ ఉన్నాయి. అతను సంవత్సరాలుగా అనేక ఆల్బమ్ లను విడుదల చేశాడు. భారతీయ సంగీత పరిశ్రమలోని ఇతర ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశాడు. కళారంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను 2006లో భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సహా సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను ఉధాస్ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. వి మిస్ యూ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. పంకజ్ ఉధాస్ మంచి గజల్, నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్‌లో తన రచనలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అనేక హిట్‌లను రికార్డ్ చేసి అభిమానులపై చెరగని ముద్ర వేశాడు.