తెలంగాణలో (Telangana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. కాగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి నిర్మల్కు (Nirmal) కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..