మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ కేసులో కీలక సాక్ష్యాలు!

| Edited By:

Jan 07, 2020 | 6:34 PM

గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఆమె మిస్ అయి ఇప్పటివరకూ 13 రోజులైనా ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోహిత ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. దాని నుంచి కీలక సమాచారం సేకరించారు. రోహిత ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహిస్తున్నారు. అటు రోహిత కుటుంబ సభ్యులు కూడా.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్ ఆపిల్ […]

మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ కేసులో కీలక సాక్ష్యాలు!
Follow us on

గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఆమె మిస్ అయి ఇప్పటివరకూ 13 రోజులైనా ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోహిత ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. దాని నుంచి కీలక సమాచారం సేకరించారు. రోహిత ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహిస్తున్నారు. అటు రోహిత కుటుంబ సభ్యులు కూడా.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. ఆ రోజు ఈ రోజు వరకూ కనీసం చిన్న క్లూ కూడా దొరకలేదు. రోహిత తన ఇద్దరు మిత్రులతో కలిసి సెలెస్టా అపార్ట్‌మెంట్లో నివసించేది. రోహిత సోదరుడు పరీక్షిత్ మాట్లాడుతూ.. తన సోదరి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆమె తన అపార్ట్ మెంట్ ముందు ఆటోలో వెళ్లడం కనిపించింది. ఆ తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళారనే దానిపై స్పష్టత లేదు. రోహిత తన ఫోన్‌ను అపార్ట్‌మెంట్‌లోనే ఉంచడంతో, ఆమె ఆచూకీని ట్రేస్ చెయ్యడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. అయితే.. ఈరోజు ఆ ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. రోహిత చివరిగా ఎవరితో చాటింగ్ చేసింది. ఎవరితో కాల్‌లో మాట్లాడింది అనేదానిపై పోలీసుల విచారణ జరుపుతున్నారు.