హైదరాబాద్లో చైనా యువతులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
కరోనా వైరస్ విస్తరణ ఇంకా కొనసాగుతోన్న వేళ.. హైదరాబాద్లో చైనా యువతులు హల్చల్ చేశారు. ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద ముగ్గురు యువతులు కారులో వెళుతుండగా.. సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరోనా వైరస్ విస్తరణ ఇంకా కొనసాగుతోన్న వేళ.. హైదరాబాద్లో చైనా యువతులు హల్చల్ చేశారు. ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద ముగ్గురు యువతులు కారులో వెళుతుండగా.. సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగలాండ్కి చెందిన ఒక యువతి ఉన్నారు. ఈ ముగ్గురిని కరోనా ఆరోగ్య పరీక్షల తనిఖీ కోసం క్వారంటైన్ కు పంపుతామని సనత్ నగర్ పోలీసులు తెలిపారు. కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12వేలు దాటేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 12,759 కేసులు నమోదు కాగా.. 420 మంది మృతి చెందారు.