ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకూ మాత్రమే గడువు ఉంది. దీంతో పన్ను చెల్లింపుదారులందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఐటీఆర్ కు అవసరమమైన రశీదులు, పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పోర్టల్ లో ఇబ్బందులు కారణంగా ఐటీఆర్ సమర్పించడం కుదరడం లేదు. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరం(2024-25) కోసం ఇప్పటివరకు 3.42 కోట్ల ఐటీఆర్ లు మాత్రమే ఫైల్ చేశారు. గతేడాది జూలై 31 నాటికి రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఐటీఆర్ లు అందాయి.
పోర్టల్ సరిగ్గా పనిచేయడం పోవడంతో ఐటీఆర్ ఫైలింగ్ ఇబ్బందులు కలుగుతున్నాయని ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ (ఐటీబీఏ) తెలిపింది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐటీఆర్ సమర్పించడానికి చెల్లింపుదారులు సిద్ధంగా ఉన్నా పోర్టల్ వల్ల ఆలస్యం జరుగుతోందని వివరించింది. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరం 2024-25 కోసం ఇప్పటివరకు 3.42 కోట్ల ఐటీఆర్ లు ఫైల్ అయ్యాయని, ఇంకా చాలామంది అందజేయాల్సి ఉందని తెలిపింది. గడువు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆగస్టు 31 వరకూ పెంచాలని వివరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐటీబీఏ అనేక విషయాలను ప్రస్తావించింది. సమస్య తెలిపుతూ, దానికి పరిష్కరానికి మార్గాలనూ సూచించింది. ఆ ప్రకారం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..