పోస్ట్ ఆఫీసు అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఉంటుంది కాబట్టి భరోసా ఉంటుంది. ఈ క్రమంలో పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉండే పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు అధిక శాతం మంది మొగ్గుచూపుతారు. తమ పెట్టుబడికి గ్యారంటీ ఉంటుందని, స్థిరమైన వడ్డీ, కచ్చితమైన రాబడి వస్తుందని నమ్ముతారు. ఈక్రమంలో పోస్ట్ ఆఫీసు కూడా మంచి స్కీమ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అటువంటి పథకాల్లో పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ) ఒకటి. దీనిలో ప్రస్తుతం 6.9శాతం నుంచి 7.5శాతం వరకూ వడ్డీ రేటు వస్తోంది. ప్రతి త్రైమాసికానికి ఈ వడ్డీ కాంపౌండింగ్ అవుతుంది. అంటే ప్రతి మూడు నెలలకు వడ్డీ అనేది అసలుకు జోడిస్తారు. ఈ పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కాల వ్యవధి ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు కూడా మీరు తీసుకునే కాల వ్యవధిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు రూ. 2లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో లెక్క చూద్దాం..
పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ ఖాతా తెరవాలని చూస్తున్న వారికి కనీస డిపాజిట్ రూ. 1,000. కనీసం రూ. 1,000 పెట్టుబడితో పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ తెరవవచ్చు. ఆ తర్వాత రూ. 100 గుణిజాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇప్పుడు మీరు రూ. 2,00,000 పెట్టుబడి పెడితే.. వివిధ కాల పరిమితులకు వడ్డీతో పాటు అసలు ఎంత వస్తుందో తెలుసుకుందాం..
రూ. 1,00,000 పెట్టుబడికి ప్రస్తుత రేట్ల ఆధారంగా వడ్డీ ఎంత వస్తుందో లెక్కిద్దాం..
మీరు రూ. 1,50,000 పెట్టుబడి పెడితే, వచ్చే వడ్డీ..
మీరు రూ. 2,00,000 పెట్టుబడి పెడితే, వచ్చే వడ్డీ..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..