Breaking: వారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్న బస్సులు

ఏపీ, తెలంగాణ మధ్య వారం రోజుల్లో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Breaking: వారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్న బస్సులు
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 7:08 PM

ఏపీ, తెలంగాణ మధ్య వారం రోజుల్లో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. దీనిపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక దీనిపై ఏపీకి చెందిన ఓ ఉన్నతోద్యోగి మాట్లాడుతూ.. ”ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభించడానికి ప్రాథమికంగా చర్చలు జరిపాము. సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కంటైన్‌మెంట్‌ జోన్ల గురించి చర్చించాం. నాలుగు దశల్లో ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసులు పునరుద్ధరించాలని అభిప్రాయానికి వచ్చాము. తొలి దశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణకు 256 సర్వీసులు నడపాలనుకుంటున్నాం” అని వివరించారు.

Read This Story Also: 17రోజుల క్రితం పుట్టిన పాపను చూడకుండానే.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ‘అమర జవాన్’ కథ