మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
మహారాష్ట్రలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. నిన్న తనకు కరోనా టెస్ట్ జరిగిందని. అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తను ఆరోగ్యంగా..
మహారాష్ట్రలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. నిన్న తనకు కరోనా టెస్ట్ జరిగిందని. అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తను ఆరోగ్యంగా ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఏకనాథ్ షిండే కోరారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 13 మంది మంత్రులు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. రాష్ట్రంలో ఇంతవరకు 12 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2 లక్షల 73 వేలకు పైగా యాక్టివ్ కేసులని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
काल मी माझी कोव्हीड-१९ ची तपासणी करून घेतली असता ती पॉझिटिव्ह आली आहे. आपल्या सगळ्यांच्या आशीर्वादाने प्रकृती ठीक आहे. गेल्या काही दिवसांत माझ्या संपर्कात आलेल्या सर्वांनी योग्य ती काळजी घ्यावी आणि स्वतःची कोव्हीड चाचणी करून आवश्यक ती खबरदारी घ्यावी, ही विनंती…
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) September 24, 2020