మున్సిపల్ పోరు: ఒకే ఇంటి నుంచి మూడు నామినేషన్లు.. ఎక్కడంటే..!

| Edited By:

Jan 11, 2020 | 9:35 AM

తెలంగాణలో మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్లకు గడువు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు గానూ మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే తాండూరులో చివరి రోజు ఒకే ఇంటి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన అవిటి శ్రీశైలం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పట్టణంలోని 26 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ […]

మున్సిపల్ పోరు: ఒకే ఇంటి నుంచి మూడు నామినేషన్లు.. ఎక్కడంటే..!
Follow us on

తెలంగాణలో మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్లకు గడువు శుక్రవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు గానూ మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే తాండూరులో చివరి రోజు ఒకే ఇంటి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన అవిటి శ్రీశైలం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పట్టణంలోని 26 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక 27వ వార్డుకు శ్రీశైలం తల్లి అవిటి వీరమణి, 29వ వార్డుకు శ్రీశైలం భార్య రాజకుమారి స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరిలో శ్రీశైలం భార్య రాజకుమారి చైర్ పర్సన్ కోసం నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా. 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.