కర్నూల్ జల్లాలో రేణూ దేశాయ్ పర్యటన

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:43 PM

కర్నూల్ జిల్లా: సినీ నటి రేణూ దేశాయ్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలువురు స్థానిక రైతులను ఆమె కలుసుకుని సమస్యలను తెలుసుకోనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడతారు. ఈ పర్యటన నిమిత్తం ఆమె నిన్ననే కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం చేరుకున్నారు. ఉదయం తుంబళబీడు గ్రామం, సాయింత్రం పెద్దకడబూరు గ్రామంలో పర్యటిస్తారు. ఆ ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలను రేణూ దేశాయ్ పరామర్శిస్తారు. హీరోయిన్‌గా నటించి మెప్పించిన రేణూ దేశాయ్ చాలా కాలంపాటు సినిమాలకు దూరమయ్యారు. […]

కర్నూల్ జల్లాలో రేణూ దేశాయ్ పర్యటన
Follow us on

కర్నూల్ జిల్లా: సినీ నటి రేణూ దేశాయ్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలువురు స్థానిక రైతులను ఆమె కలుసుకుని సమస్యలను తెలుసుకోనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడతారు. ఈ పర్యటన నిమిత్తం ఆమె నిన్ననే కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం చేరుకున్నారు. ఉదయం తుంబళబీడు గ్రామం, సాయింత్రం పెద్దకడబూరు గ్రామంలో పర్యటిస్తారు.

ఆ ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలను రేణూ దేశాయ్ పరామర్శిస్తారు. హీరోయిన్‌గా నటించి మెప్పించిన రేణూ దేశాయ్ చాలా కాలంపాటు సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రైతు సమస్యల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్టు గతంలో ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతు సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇలా రైతుల వద్దకు వస్తున్నారు.