విజయవాడలో గ్యాంగ్‌వార్‌.. ఆరుగురు అరెస్ట్‌

| Edited By:

Jun 27, 2020 | 3:05 PM

విజయవాడలో మరో గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు.

విజయవాడలో గ్యాంగ్‌వార్‌.. ఆరుగురు అరెస్ట్‌
Follow us on

విజయవాడలో మరో గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరంలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన బర్త్‌డే పార్టీలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. ఆ వేడుకలకు వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్‌ అనే మరో రౌడీ షీటర్ వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ మొదలు కాగా.. ఒకరిపై మరొకరు కత్తులతో దాడులకు దిగారు.

కాగా మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్‌ సబ్బవరం మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెంటిల్‌మెంట్లు చేయడం లాంటివి చేస్తుంటాడని అక్కడి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై ఒక్క పోలీస్‌ స్టేషన్‌లోనే 12 కేసులు ఉన్నట్లు సీఐ పైడిపు నాయుడు పేర్కొన్నారు. ఇక గందవరపు తరుణ్ బీటెక్ చదవగా.. ఓ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అని, సైబర్ నేరాలు చేయడంలోనూ దిట్ట అని సమాచారం. ప్రజాప్రతినిథులకు ఫేక్ కాల్స్ చేసిన విషయంలోనూ తరుణ్‌పై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తాజా గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.