మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత

| Edited By:

Jul 30, 2020 | 9:37 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు(75) కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.

మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూత
Follow us on

Koppana Mohanarao Passes Away: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు(75) కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1978,1989) పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున సేవలందించారు. మరోవైపు ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read This Story Also: ఆ పాత్ర కోసం నాన్న సలహాలు తీసుకున్నా