డబుల్ మర్డర్‌ కలకలం..

|

Nov 05, 2019 | 6:04 PM

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం గొర్రిపల్లిలో జంట హత్యలు కలకలం రేపాయి.. గొర్రిపల్లిలోని పొలాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా నివాసముంటున్న ఈశ్వర్‌, మురళి అనే ఇద్దరూ బట్టల వ్యాపారం చేస్తుంటారు. సాయంత్రానికి పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారి కాచిన దుండగులు కళ్లలో కారంచల్లి అత్యంత దారుణంగా హతమార్చారు. మృతుల ఒంటిపై కారంపొడి పోట్లాలను చల్లి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు.  ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా జరిగిన డబుల్‌ […]

డబుల్ మర్డర్‌ కలకలం..
Follow us on

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం గొర్రిపల్లిలో జంట హత్యలు కలకలం రేపాయి.. గొర్రిపల్లిలోని పొలాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా నివాసముంటున్న ఈశ్వర్‌, మురళి అనే ఇద్దరూ బట్టల వ్యాపారం చేస్తుంటారు. సాయంత్రానికి పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారి కాచిన దుండగులు కళ్లలో కారంచల్లి అత్యంత దారుణంగా హతమార్చారు. మృతుల ఒంటిపై కారంపొడి పోట్లాలను చల్లి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు.  ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా జరిగిన డబుల్‌ మర్డర్‌ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. సంఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.