ఆధార్.. ఆచూకీ పట్టిచ్చింది.. పదేళ్ల స్టోరీ.. అనాధాశ్రమం నుంచి ఫోన్.. చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Jul 27, 2024 | 7:33 PM

ఆ దంపతులు పేర్లు నాగేంద్రం, శ్రీను.. పల్నాడు జిల్లా కోట్టప్పకొండ నివాసం... వెంట్రుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి మానసిక వికలాంగులైన ఇద్దరూ కొడుకులున్నారు. రాజు, ఇమ్మానియేల్.. ఇద్దరూ పదేళ్ల క్రితం తప్పిపోయారు.

ఆధార్.. ఆచూకీ పట్టిచ్చింది.. పదేళ్ల స్టోరీ.. అనాధాశ్రమం నుంచి ఫోన్.. చివరకు ఏం జరిగిందంటే..
Aadhaar (representative image)
Follow us on

ఆ దంపతులు పేర్లు నాగేంద్రం, శ్రీను.. పల్నాడు జిల్లా కోట్టప్పకొండ నివాసం… వెంట్రుకల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి మానసిక వికలాంగులైన ఇద్దరూ కొడుకులున్నారు. రాజు, ఇమ్మానియేల్.. ఇద్దరూ పదేళ్ల క్రితం తప్పిపోయారు. వెంట్రుకల వ్యాపారం చేసుకునే దంపతులు తమ వృత్తిలో భాగంగా అప్పుడు హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. ఒకరోజు ఇద్దరూ కొడుకులు ఏడిపిస్తుండటంతో తల్లి నాగేంద్రం డబ్బులిచ్చి కొనుక్కోమని కొట్టు వద్దకు పంపించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ తప్పిపోయారు.

అప్పటి నుండి ఇద్దరు కొడుకుల ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నా.. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో ఇక గాలించడం దండగ అంటూ వదిలేశారు. అయితే నాలుగు రోజుల క్రితం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుంపూర్ లోని బేతాని సంరక్షణ ఆనాధాశ్రమం నుండి శ్రీనుకి ఫోన్ వచ్చింది. మీ పిల్లలిద్దరూ ఆశ్రమంలో ఉంటున్నట్లు అక్కడి వారు ఫోన్ లో చెప్పారు.

దీంతో వారు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవటానికి శ్రీను, నాగేంద్రంలు మగ్దుంపూర్ వెళ్లారు. అక్కడ తమ బిడ్డలుండటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. వారిని తీసుకొని తమ స్వగ్రామానికి వచ్చారు.

అయితే ఎల్బీ నగర్లో ఐదేళ్ల వయస్సులోనే తప్పిపోయిన వీరిద్దరూ బేతాని ఆశ్రమంకు చేరారు. అప్పటి నుండి వీరి సంరక్షణలోనే వీరిద్దరూ ఉన్నారు.

అయితే వీరికి ఆధార్ తీయించేందుకు ఆశ్రమ నిర్వాహకులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే వీరి పేరుతో ఆధార్ ఉన్నట్లు గుర్తించారు. కొత్త ఆధార్ తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.

దీంతో ఆధార్ సమాచారంతో వారిద్దరి అడ్రస్ తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ఆశ్రమ నిర్వాహకులు ఫోన్ చేశారు. దీంతో పదేళ్ల తర్వాత తమ నుండి దూరమైన బిడ్డలిద్దరూ తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు.

తమ కొడుకులిద్దరూ ఇక కనిపించరని అనుకోని జీవిస్తున్న దంపతులకు.. ఆచూకీ లభించడంతో.. వారు ఆనందంలో మునిగితేలారు.. తమ పిల్లలు తమ దగ్గరకు చేరారంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..