తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంచుమించు ఏదోఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటోంది. తాజాగా.. తిరుపతి దేవస్థానం నుంచి బంగారం తరలింపు మరో వివాదంగా మారింది. దీనిపై వైసీపీ తదితర కొన్ని పార్టీలు విమర్శలు గుప్పించడంతో.. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీకి సంబంధించి ఇప్పటివరకు 9,259 కిలోల బంగారం ఉందని.. దానిని.. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు లాకర్లలో భద్రపరిచామని తెలిపారు. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్బీదేనని స్పష్టం చేశారు. గోల్డ్ ఓనర్ షిప్ను కూడా మేము క్లెయిమ్ చేయలేదన్నారు అనిల్ కుమార్ సింఘాల్.