టిక్‌టాక్‌ మోజుః యువతి ప్రేమలో పడ్డ ఇల్లాలు.. ఇద్దరు పిల్లలతో పరార్‌

| Edited By: Ram Naramaneni

Dec 14, 2019 | 1:53 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అనేక కుటుంబాల్లో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో టిక్‌టాక్‌ మోజులో పడి ఓ ఇల్లాలు తన […]

టిక్‌టాక్‌ మోజుః యువతి ప్రేమలో పడ్డ ఇల్లాలు.. ఇద్దరు పిల్లలతో పరార్‌
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అనేక కుటుంబాల్లో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి.

తాజాగా కర్నూలు జిల్లాలో టిక్‌టాక్‌ మోజులో పడి ఓ ఇల్లాలు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పరారైంది.
జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అర్చన..గత కొంతకాలంగా టిక్‌టాక్‌ చేస్తుంది. అయితే అర్చనకు టిక్‌టాక్‌లో బెంగళూరుకు చెందిన అంజలి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన అంజలి పురుషుడి వేషంలో టిక్‌టాక్‌లు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, అర్చనకు అప్పటికే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంజలితో ప్రేమలో పడ్డ అర్చన మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో బెంగళూరుకు చెందిన అంజలితో కలిసి వెళ్లిపోయింది. జరిగిన ఘటనపై అర్చన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.