జనసేనానికి విద్యార్థి సంఘాల శవయాత్ర

|

Sep 07, 2019 | 7:17 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు లో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని రాజ్ విహర్ సెంటర్ లో రాయలసీమ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుతో శవయాత్ర సాగింది. రాయలసీమ ప్రాంతాన్ని దెబ్బ తీసేవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను ఉరేగించి దగ్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజధాని కర్నూలు కి కేటాయించాలని చెప్పి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. రాయలసీమ […]

జనసేనానికి విద్యార్థి సంఘాల శవయాత్ర
Follow us on
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు లో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని రాజ్ విహర్ సెంటర్ లో రాయలసీమ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుతో శవయాత్ర సాగింది. రాయలసీమ ప్రాంతాన్ని దెబ్బ తీసేవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను ఉరేగించి దగ్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజధాని కర్నూలు కి కేటాయించాలని చెప్పి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి నష్టం కలిగించే విధంగా అమరావతి జపం చేస్తున్నారని రాయలసీమ విద్యార్ది సంఘాల నాయకులు మండిపడ్డారు. అమరావతి కోసం ధీక్షను చేపడతామన్న పవన్ కళ్యాణ్ కు రాయలసీమ విద్యార్థులుగా బుద్ధి చెపుతామన్నారు. రాయలసీమ హక్కుల కోసం ఎంతటి పోరాటాలకైన తాము సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.