తమ్ముడి కొడుకుపై హత్యాయాత్నం

|

Oct 18, 2019 | 7:39 PM

గుంటూరు జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడి కొడుకుపై అన్న పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో యువకుడి శరీరం40శాతానికిపైగా కాలిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గుంటూరు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి గ్రామానికి చెందిన నాసిన పెదకొండయ్య, చినకొండయ్య అన్నదమ్ములు. సోదరుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఒకరినొకరు […]

తమ్ముడి కొడుకుపై హత్యాయాత్నం
Follow us on

గుంటూరు జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడి కొడుకుపై అన్న పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో యువకుడి శరీరం40శాతానికిపైగా కాలిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గుంటూరు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి గ్రామానికి చెందిన నాసిన పెదకొండయ్య, చినకొండయ్య అన్నదమ్ములు. సోదరుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. అయితే విషయం అక్కడితో వదిలిపెట్టని పెదకొండయ్య అర్ధరాత్రి దాటిన తరువాత సమయంలో పక్కనే ఉన్న తమ్ముడు ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తమ్ముడి కొడుకు రాకేష్ పై పెట్రోల్‌ పోసి నిప్పంటిచాడు. మంటల్లో చిక్కుకున్న రాకేష్‌ కేకలు వేయడంతో నిందితుడు పెదకొండయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బాలుని శరీరం సగానికి పైగా కాలిపోయింది. రాకేష్‌ పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నవెూదు చేశారు.