నలుగురు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య

|

Sep 23, 2019 | 5:49 PM

కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా ఓ తల్లి తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది. డోన్ తారకరామా నగర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. స్థానికంగా నివసించే వర లక్ష్మి అనే మహిళ తన నలుగురు పిల్లలకు టీలో పురుగుల మందు కలిపి తాగించింది. అనంతరం తాను కూడా అదే టీ తాగి బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగడం ఇష్టం లేక పిల్లలు […]

నలుగురు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
suicide
Follow us on

కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా ఓ తల్లి తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది. డోన్ తారకరామా నగర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. స్థానికంగా నివసించే వర లక్ష్మి అనే మహిళ తన నలుగురు పిల్లలకు టీలో పురుగుల మందు కలిపి తాగించింది. అనంతరం తాను కూడా అదే టీ తాగి బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగడం ఇష్టం లేక పిల్లలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మరణించింది.. పెద్దపాప ఇందు, రెండవ పాప ఉమాదేవి, కుమారుడు ఉదయ్ కుమార్, చిన్న కూతురు ఐశ్వర్య లకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. జరిగిన ఘటనపై మృతురాలి భర్త ఈరన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.