Tirupati: ఈ దంపతులిద్దరూ దేశముదుర్లు.. యువతికి గంజాయి అలవాటు చేసి.. ఆపై

| Edited By: Ram Naramaneni

Jul 27, 2024 | 4:19 PM

న్యాయ విద్య చదువుతున్నారు కానీ ఏం లాభం. దంపతులు ఇద్దరికీ గంజాయి అలవాటు ఉంది. మరో యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడి.. ఆమె నుంచి డబ్బు డిమాండు చేశారు.

Tirupati: ఈ దంపతులిద్దరూ దేశముదుర్లు.. యువతికి గంజాయి అలవాటు చేసి.. ఆపై
Couple
Follow us on

భార్యభర్తలిద్దరూ లా చదివారు కానీ.. గాడి తప్పారు. గంజాయి మత్తుకు అలవాటై.. విచ్చలవిడిగా ప్రవర్తించారు. తోటి విద్యార్థిని కూడా ఆ రొంపిలోకి దింపారు. ఆమెకు కూడా గంజాయి అలవాటు చేసి..  భర్త అత్యాచారం చేయగా.. భార్య ఆ వీడియోలు తీసింది. ఆపై డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన 22 ఏళ్ల యువతి.. 4 సంవత్సరాల క్రితం.. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో LLB చేసేందుకు జాయిన్ అయింది.  అక్కడే కాలేజ్ హాస్టల్‌లో ఉంటున్న ఆమెకు.. తిరుపతి సమీపంలోని పుదిపట్లకు చెందిన తోటి విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ ఫ్రెండ్ అయింది. దీంతో యువతి ప్రణవకృష్ణ ఇంటికి తరచూ వస్తూ.. వెళ్తూ ఉండేది.  ఈ సమయంలోనే ప్రణవకృష్ణ భర్త.. కృష్ణకిషోర్‌రెడ్డితో కూడా యువతికి పరిచయమైంది. అతను ఎస్వీయూ లా కాలేజ్‌లో LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

గంజాయికి అలవాటైన  దంపతులిద్దరూ.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే యువతికి కూడా అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్‌రెడ్డి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను అతని భార్య వీడియో తీసింది. తరువాత వాటిని చూపి యువతిని బెదిరించడం మొదలెట్టారు. తొలుత తన బంగారు నగలు తీసుకున్నారు. అక్కడితో ఆగలేదు. ఆ జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫోటోలు, వీడియోలను…  ప్రణవ్‌కృష్ణ బాధిత యువతి సోదరుడితోపాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. విషయం తెలియడంతో… కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.