వేధింపులు తాళలేకే కోడెల ఆత్మహత్యః టీడీపీ

|

Sep 19, 2019 | 2:56 PM

ప్రభుత్వం వేధింపుల వలనే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల సంతాప సభ నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పార్టీ అధ్యక్షుడు పార్థసారథి తో పాటు పలువురు నేతలు కోడెలకు నివాళులు అర్పించారు. పల్నాడులో పులిలో బతికిన వ్యక్తి ఇంత త్వరగా ఇలా మరణిస్తాడని ఊహించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిటాల రవితో పాటు ఎంతో మంది […]

వేధింపులు తాళలేకే కోడెల ఆత్మహత్యః టీడీపీ
Follow us on
ప్రభుత్వం వేధింపుల వలనే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల సంతాప సభ నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పార్టీ అధ్యక్షుడు పార్థసారథి తో పాటు పలువురు నేతలు కోడెలకు నివాళులు అర్పించారు. పల్నాడులో పులిలో బతికిన వ్యక్తి ఇంత త్వరగా ఇలా మరణిస్తాడని ఊహించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిటాల రవితో పాటు ఎంతో మంది హత్యకు గురయ్యారని పరిటాల సునీత గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ హయంలో వేధింపులకు గురి చేస్తూ వారి చావుకు పరోక్షంగా కారణమవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం వలనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, చిన్న చిన్న అంశాలకే కేసులు పెడుతూ… ప్రభుత్వం ఒత్తిడి వలనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ లేదని సీఎం చెబుతున్నా.. పరోక్షంగా చంపుతున్నారని ఆరోపించారు. కోడెల కూతురు ఏడవటం పై కూడా వైసీపీ నాయకులు కామెంట్స్ చేయటం దారుణమన్నారు.