అప్పిచ్చిన పాపానికి హతమార్చారు..

| Edited By: Srinu

Nov 25, 2019 | 5:20 PM

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన క్రోసూరు మండలం గరికపాడులో జరిగింది. గరికపాడు గ్రామానికి చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని కృష్ణప్రసాద్‌ తరచూ […]

అప్పిచ్చిన పాపానికి హతమార్చారు..
Follow us on

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు అతి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన క్రోసూరు మండలం గరికపాడులో జరిగింది. గరికపాడు గ్రామానికి చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి దగ్గర రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని కృష్ణప్రసాద్‌ తరచూ గోపీకృష్ణను అడుగుతున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన గోపీకృష్ణ అతడి హత్యకు ప్లాన్‌ చేశాడు. రాత్రి బాగా చీకటి పడిన తర్వాత..కృష్ణప్రసాద్‌ను పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా మృతుడి కుటుంబీకులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు