శ్రీశైలం భ్రమరాంబకు బంగారు ఖడ్గం

| Edited By: Srinu

Aug 30, 2019 | 7:46 PM

శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి బంగారు ఖడ్గాన్ని బహుకరించారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్‌రెడ్డి.  235 గ్రాముల బంగారంతో తయారు చేయబడిన ఈ ఖడ్గం ఆరు వైపులా సింహాలాటాలను కూడి ఉంది. అదే విధంగా రెండు వైపులా రెండు తెల్లరాళ్లు,, పచ్చరాళ్లతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రదానార్చకులు, వేద పండితుల సమక్షంలో ఖడ్గాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ప్రభాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను వేదమంత్రోచ్చరణలతో ఆశ్రీర్వదించిన అర్చకులు.. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, […]

శ్రీశైలం భ్రమరాంబకు బంగారు ఖడ్గం
Follow us on
శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి బంగారు ఖడ్గాన్ని బహుకరించారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్‌రెడ్డి.  235 గ్రాముల బంగారంతో తయారు చేయబడిన ఈ ఖడ్గం ఆరు వైపులా సింహాలాటాలను కూడి ఉంది. అదే విధంగా రెండు వైపులా రెండు తెల్లరాళ్లు,, పచ్చరాళ్లతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రదానార్చకులు, వేద పండితుల సమక్షంలో ఖడ్గాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ప్రభాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను వేదమంత్రోచ్చరణలతో ఆశ్రీర్వదించిన అర్చకులు.. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఖడ్గం విలువ సుమారు 9.45 లక్షల దాకా ఉంటుందని దాతలు తెలిపారు.