Andhra Pradesh: కృష్ణా జిల్లాలో పెను విషాదం.. సముద్రంలో నలుగురు మత్స్యకారుల గల్లంతు..

|

Jul 05, 2022 | 9:49 PM

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో పెను విషాదం.. సముద్రంలో నలుగురు మత్స్యకారుల గల్లంతు..
Follow us on

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. కాగా, విషయం తెలుసుకున్న అధికారులు, రెస్క్యూటీమ్ సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. హెలికాప్టర్ సహాయంతో గాలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, గల్లంతైన మత్స్యకారులు మచిలీపట్నం క్యాంప్ బెల్ పేటకు చెందిన వారుగా గుర్తించారు. ఇదిలాఉంటే.. బాధితుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.