విశాఖలోనే రాజధాని..ఎవరూ ఆపలేరుః తమ్మినేని

|

Dec 24, 2019 | 12:23 PM

ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా, ఉద్యమాలు చేసినా విశాఖలోనే రాజధాని వచ్చి తీరుతుందని ఖరాఖండిగా చెప్పారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీర్చే నాయకుడి కోసం కలలు కన్నామని, అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రూపంలో రావటం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. మూడు రాజధానులు, నాలుగు ప్రాంతాయ మండళ్ల ఏర్పాటుకు జగన్‌ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని వదులుకుంటే ఉత్తరాంధ్ర వాసులంతా అజ్ఞానులు మరొకరు ఉండరని […]

విశాఖలోనే రాజధాని..ఎవరూ ఆపలేరుః తమ్మినేని
Follow us on
ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా, ఉద్యమాలు చేసినా విశాఖలోనే రాజధాని వచ్చి తీరుతుందని ఖరాఖండిగా చెప్పారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీర్చే నాయకుడి కోసం కలలు కన్నామని, అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రూపంలో రావటం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. మూడు రాజధానులు, నాలుగు ప్రాంతాయ మండళ్ల ఏర్పాటుకు జగన్‌ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని వదులుకుంటే ఉత్తరాంధ్ర వాసులంతా అజ్ఞానులు మరొకరు ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకుడంటే దమ్మున్నోడు..నాయకుడంటే గుండెబలమున్నాడో..అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంటే ఉద్యమాలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ పడిపోయిందనా, లేక మీరు కొన్న భూముల ధరలు భూంఫట్‌ అయ్యాయని చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అమరావతిలో ఉద్యమాలు చేసేదంతా భూములు కొట్టేసినోళ్లు, పచ్చచొక్కావాళ్లే అని ఎద్దేవా చేశారు.
విశాఖకు, పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారా.వద్దంటున్నారా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. అమరావతిలో లెజిస్లేచర్‌ రాజధాని ఉండాలంటారా..? వద్దంటారా..? అన్నదానిపై మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఉద్యమాలు చేస్తున్నారా, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే.., మీకు ఇంకా బుద్దిరాలేదా అని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బ్రహ్మదేవుడు ఉద్యమాలు చేసేవారికి బుద్ధిని ప్రసాధించాలని కోరుకుంటున్నానని అన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.