కరోనా పంజా…ఏపీలో కొత్తగా 70 కేసులు

|

May 30, 2020 | 2:59 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వెంటాడుతోంది. శుక్రవారం ఒక్కరోజు మాత్రం తక్కువగా నమోదైన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం మళ్లీ పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 70 కేసులు బయటపడ్డాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది.. మిగిలిన కేసులు 61 ఉన్నాయి. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,944కు చేరాయి. మరో 55 మంది వైరస్ నుంచి కోలుకొని […]

కరోనా పంజా...ఏపీలో కొత్తగా 70 కేసులు
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వెంటాడుతోంది. శుక్రవారం ఒక్కరోజు మాత్రం తక్కువగా నమోదైన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం మళ్లీ పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 70 కేసులు బయటపడ్డాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది.. మిగిలిన కేసులు 61 ఉన్నాయి. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,944కు చేరాయి. మరో 55 మంది వైరస్ నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 792కు చేరింది. శనివారం వరకు కరోనా వల్ల 60 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 9504 శాంపిల్స్ పరీక్షించగా… 70 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా 650కి వైరస్ కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి.