గ్రామ వాలంటీర్లకూ దసరా బొనాంజా..!

| Edited By:

Oct 07, 2019 | 1:28 PM

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాల్లో వైఎస్ జగన్ మార్పులు తీసుకొస్తున్నారు. కాగా, ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. అయితే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎంపికైన వారు ఆగష్టు 15వ తేదీ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.5వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,85,525 మంది గ్రామ, […]

గ్రామ వాలంటీర్లకూ దసరా బొనాంజా..!
Follow us on

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాల్లో వైఎస్ జగన్ మార్పులు తీసుకొస్తున్నారు. కాగా, ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. అయితే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎంపికైన వారు ఆగష్టు 15వ తేదీ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.5వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,85,525 మంది గ్రామ, వార్డు వాలంటీర్లుగా విధుల్లో ఉన్నారు.

కాగా, నేడు సీఎం జగన్ గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో సీఎం జగన్ పలు అంశాలపై చర్చించనునున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు శుభవార్త చెప్పేందుకు జగన్ మరో నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తోంది. గ్రామ వాలంటీర్ గౌరవ వేతనం రూ.5వేలకు మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ భేటీలో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దసరా సందర్బంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లకు కూడా దసరా కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.