టీడీపీ నాయకులకు అవంతి సవాల్

| Edited By:

Oct 18, 2020 | 7:22 PM

హైదరాబాద్: టీడీపీ పార్టీకి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఇటీవలే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ గానీ కేటీఆర్ కానీ తనను బెదిరించారని నిరూపిస్తే దేనికైనా రెడీ అని అన్నారు. గడిచిన ఐదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేశారా? అని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తని కాదని, తనను ఎవరో బెదిరించారన్న వార్తలు నిజం కాదని తెలిపారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నాయకులను కేసీఆర్ […]

టీడీపీ నాయకులకు అవంతి సవాల్
Follow us on

హైదరాబాద్: టీడీపీ పార్టీకి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఇటీవలే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ గానీ కేటీఆర్ కానీ తనను బెదిరించారని నిరూపిస్తే దేనికైనా రెడీ అని అన్నారు. గడిచిన ఐదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేశారా? అని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తని కాదని, తనను ఎవరో బెదిరించారన్న వార్తలు నిజం కాదని తెలిపారు.

హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నాయకులను కేసీఆర్ బెదిరించి వైసీపీలో చేర్పించేలా చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై అవంతి శ్రీనివాస్ ఖండించారు. హైదరాబాద్‌లో ఆస్తులు తన కొక్కడికే ఉన్నాయా? టీడీపీ నేతలకు లేవా? అని ప్రశ్నించారు. ఎనభై శాతం నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని అవంతి అన్నారు.