గ్యాంగ్ స్టర్ ఎమ్మెల్యే అక్రమ ఆస్తుల కూల్చివేత

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 4:38 PM

యూపీలో గ్యాంగ్ స్టర్ గా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ అక్రమంగా నిర్మించుకున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతకు అయిన ఖర్చులన్నీ

గ్యాంగ్ స్టర్ ఎమ్మెల్యే అక్రమ ఆస్తుల కూల్చివేత
Follow us on

యూపీలో గ్యాంగ్ స్టర్ గా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ అక్రమంగా నిర్మించుకున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతకు అయిన ఖర్చులన్నీ ఈ ఎమ్మెల్యే నుంచే రాబట్టాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. మీరు మీ నేరస్థ జీవితానికైనా స్వస్తి చెప్పండి..లేదా ప్రభుత్వం తీసుకునే ఇలాంటి  నిర్ణయాలనైనా ఎదుర్కోండి అని లక్నో డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు అంటున్నారు. గురువారం ఉదయం నుంచే ఇతని అక్రమ ఆస్తుల కూల్చివేతకు రంగం సిధ్దమైంది. ఈ రెండు భవనాలు ముక్తార్ అన్సారీ ఇద్దరు కుమారుల పేరిట ఉందని, వారి నుంచి కూల్చివేతకు పెట్టిన ఖర్చులను రాబడతామని సీఎం యోగికి మీడియా అడ్వైజర్ అయిన మృత్యుంజయ్ కుమార్ చెప్పారు.

ఇక ఇతని కుమారుల్లో ఒకడి సన్నిహితుడి 50 లక్షల విలువైన అక్రమ ఆస్తులను వారణాసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆస్తులను కూల్చివేస్తుండగా అన్సారీ ఒక్క మాట అయినా మాట్లాడితే ఒట్టు !