Drone Medicine: దేశంలో తొలిసారిగా డ్రోన్ ద్వారా మందుల పంపిణీ..బెంగళూరు దగ్గరలో జూన్ 18 నుంచి ట్రయల్స్ ప్రారంభం!

|

Jun 14, 2021 | 7:42 PM

Drone Medicine: భారతదేశంలో తొలిసారిగా డ్రోన్ ద్వారా మెడిసిన్ డెలివరీ జూన్ 18 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులో దీనిని ప్రారంభిస్తారు. ఈ విధానాన్ని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బివిలోస్) మెడికల్ డ్రోన్ అని కూడా అంటారు.

Drone Medicine: దేశంలో తొలిసారిగా డ్రోన్ ద్వారా మందుల పంపిణీ..బెంగళూరు దగ్గరలో జూన్ 18 నుంచి ట్రయల్స్ ప్రారంభం!
Drone Medicine
Follow us on

Drone Medicine: భారతదేశంలో తొలిసారిగా డ్రోన్ ద్వారా మెడిసిన్ డెలివరీ జూన్ 18 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులో దీనిని ప్రారంభిస్తారు. ఈ విధానాన్ని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బివిలోస్) మెడికల్ డ్రోన్ అని కూడా అంటారు. థ్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ (టాస్) అనే సంస్థ బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదానూర్ వద్ద 30 నుండి 45 రోజుల పాటు ఈ విధానంపై ట్రయల్స్ నిర్వహిస్తుంది. టాస్ తో పాటుగా కన్సార్టియంలో ఇన్వోలి-స్విస్ కూడా ఉన్నాయి. ఇన్వోలి-స్విస్ ప్రొఫెషనల్ డ్రోన్ అనువర్తనాల కోసం ఎయిర్ ట్రాఫిక్ అవగాహన వ్యవస్థలలో ప్రత్యేకత కలిగి ఉన్న సంస్థ. ఈ డ్రోన్ మెడికల్ డెలివరీ విధానానికి హనీవెల్ ఏరోస్పేస్ భద్రతా సంస్థగా ఉంది. కన్సార్టియం రెండు రకాల డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. వీటిలో మెడ్‌కాప్టర్, టాస్ ఉన్నాయి. ఈ ఆన్-డిమాండ్ డెలివరీ సాఫ్ట్‌వేర్‌కు రాన్డింట్ (RANDINT) అని పేరు పెట్టారు.

ఈ మెడ్‌కాప్టర్ చిన్న డ్రోన్ లు ఒక కిలో బరువుతో ఉండి 15 కిలోమీటర్ల వరకూ వెళ్ళగలవు. ఇందులో మిగిలినవి రెండు కిలోల బరువుతో 12 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. 30-45 రోజుల్లో ఈ డ్రోన్ ల ప్రయాణాలు.. భద్రత కోసం ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో డీజీసీఏ నిబంధనల కనీసం 100 గంటలు ఈ డ్రోన్ లు ప్రయాణించాలి. అయితే ట్రయల్స్ లో కనీసం 125 గంటల ప్రయాణాన్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డ్రోన్ ల ప్రయాణాల లాగ్ ను సమీక్షల కోసం ఎప్పటికప్పుడు డీజీసీఏ కి అందచేస్తారు.

మొట్టమొదటి అధికారిక మెడికల్ డ్రోన్ డెలివరీ..

థ్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్, 2020 మార్చి 20 న, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నుండి డ్రోన్ ల వినియోగానికి అనుమతి పొందింది, అయితే కరోనా మహమ్మారి కారణంగా కొంత ఆలస్యం అయింది. థ్రోటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ సిఇఒ నాగేంద్రన్ కందసామి మాట్లాడుతూ మరో రెండు కన్సార్టియాలకు కూడా బివిలోస్ అనుమతి ఉందని చెప్పారు. ఇది చట్టబద్ధంగా తమ మొదటి అధికారిక మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రయోగం అని తెలిపారు.

నారాయణ హెల్త్ డైరెక్టర్, ప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవిశెట్టి కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి. టాస్, నారాయణ హెల్త్ డ్రగ్ డెలివరీ కోసం భాగస్వామి. ట్రయల్స్ సమయంలో, మందులు పంపిణీ చేయడానికి డ్రోన్లు ఉపయోగించబడతాయి.

నారాయణ హెల్త్‌తో భాగస్వామ్యం గురించి మాట్లాడిన కందసామి, ఔషధాల గురించి, మనం ఎలాంటి మందులు రవాణా చేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. డ్రోన్‌తో రవాణాలో సమస్య ఏమిటి, భవిష్యత్తులో దీనిని దినచర్యగా ఎలా ఉపయోగించవచ్చు. అనేది ఈ ట్రయల్స్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. నారాయణకు డిమాండ్ వచ్చిందని తమ సాఫ్ట్‌వేర్‌కు తెలుస్తుందని కందసామి అన్నారు. రిసీవర్ ఎవరో ఎవరికీ తెలియదని, ప్రీలోడ్ చేసిన చిరునామాలో ఔషధం పంపిణీ చేయడం జరుగుతుందనీ ఆయన వివరించారు.

Also Read: Coronavirus Second Wave: కరోనా మొదటి వేవ్ కంటె రెండో వేవ్ ఉధృతంగా వచ్చింది..అంతే వేగంగా అదుపులోకి వస్తోంది..

Petrol One Rupee: బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన వాహనదారులు.. ఎక్కడో తెలుసా..?